దేశంలో ఎన్నికలకు పేపర్‌ బ్యాలెటే శ్రీరామరక్ష

Update: 2018-12-22 14:27 GMT


దేశంలో ఎన్నికలకు పేపర్‌ బ్యాలెటే శ్రీరామరక్ష అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేపర్‌ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలను నిర్వహించాలని పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ఈవీఎంలను నమ్మే పరిస్థితి లేదని అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పేపర్‌ బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికల నిర్వహణ ఉంటుందన్నారు. మనం ఎవరికి ఓటు వేసామో కూడా తెలియని పరిస్థితి నేడు మన దేశంలో దాపరించింది. నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకంటే లెక్కింపు సమయంలోనే ఓట్లు రెట్టింపు లెక్కలు వస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. మళ్లీ తిరిగి రాబోయే ఎన్నికల్లో పేపర్ బ్యాలేట్‌నే తీసుకోస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

Similar News