తంత్రం లేని సేనాని.. యుద్ధం లేని సైన్యం: కత్తి మహేష్

Update: 2018-01-29 09:04 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చలో రే చల్ అంటూ ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై దృష్టి పెడుతున్నారు. 2019 వరకూ సినిమాలను సైతం పక్కనపెట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనకు పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు హాజరై ఘన స్వాగతం పలుకుతున్నారు. ” తంత్రం లేని సేనాని, యుద్ధం లేని సైన్యం…సమస్య ఇంకా బేసిక్ లేవెల్లోనే ఉంది..ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఏదో ఒకటి చేయొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాల వైపు వచ్చేలోగా ఎంతో కొంత మార్చొచ్చు ” అంటూ ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ చలో రే చల్ యాత్ర సందర్భంగా ఇంకా చేయాల్సింది, సాధించాల్సింది ఎంతో ఉందని పరోక్షంగా అంటూ మహేష్ సెటైర్ వేశాడు. ప్రస్తుతం పవన్ రాయలసీమ కరువు పరిస్థితులపై అనంతపురం జిల్లాలోని స్థానిక నేతలతో చర్చిస్తూ యాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే.

Similar News