నా చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు: చిరంజీవి

Update: 2018-02-03 11:56 GMT

ప్రముఖ సీనియర్ నటి, నట శిక్షకురాలు లక్ష్మీదేవి కనకాల మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘పేరు లక్ష్మీ దేవి అయినా ఆమె నా పాలిట సరస్వతీ దేవి. ఆమె పాఠాలే నా పాఠవాలకి మూలం. నటనలో ఆమె నేర్పిన మెళకువలే నాలోని నటుడికి మెలుకువలు. లక్షలాది కుటుంబాలకి అభిమాన కథానాయకుడిగా ఎంత సంతోషపడతానో.. లక్ష్మీదేవి గారి శిష్యుడిగా అంత గర్వపడుతున్నాను. వారు దూరమవ్వడం తీరనిలోటు. నాకే కాదు తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతీ మనసుకి ఇవి బరువైన క్షణాలు. అలా బరువెక్కిన మనుసుతో నా చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నా. కనకాల కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. దేవదాసు- లక్ష్మీదేవిల కుమారుడు రాజీవ్ కనకాలకు చిరంజీవి ఫోన్ చేసి పరామర్శించారు.  
 

Similar News