హోదా ఇచ్చేదేలేదు.. మరోమారు తేల్చిచెప్పిన కేంద్రం

Update: 2018-12-18 10:40 GMT


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంపై నేడు పార్లమెంట్ లో చర్చసాగింది. అయితే ఏపీకి ప్రత్యేహోదా ఇచ్చేది లేదని మరోసారి కేంద్రసర్కార్ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని ఇప్పటికే ప్రకటించనట్లు కేంద్రం వివరించింది. హోదా అంశమై మంగళవారం రాజ్యసభలో టీటీడీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కేంద్రాన్ని ప్రశ్నించగా దీనిపై కేంద్రం స్పందిస్తూ ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేదే లేదని బల్లగుద్దిమరి తేల్చి చెప్పింది. కాగా విదేశీ సంస్థల ద్వారా ఏపీ రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని కేంద్రం చెప్పింది.14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ఏపీకి ప్రత్యేక హోదా అమల్లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. 

Similar News