కజకిస్తాన్లో ఘోర విషాదం జరిగింది. ఓ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 52 మంది మరణించారు. కజకిస్తాన్లో అక్టావులోని ఇర్గిజ్ జిల్లాలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కజకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈమేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రమాదం నుంచి ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. బాధితులందరూ ఉజ్జేకిస్తాన్కు చెందినవారుగా సమాచారం.