ఏపీలో తెదేపా, భాజపా పొత్తు కొనసాగింపుపై అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయి. శాసనసభలో సీఎం చేసే ప్రకటన బట్టి భాజపా తమ నిర్ణయం వెల్లడించే అవకాశముంది. పొత్తు ఉపసంహరించుకుంటామని సీఎం వెల్లడిస్తే రాజీనామాకు సిద్ధంగా ఉండాలని భాజపా అధిష్ఠానం తమ మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. నిర్ణయం తీసుకున్న వెంటనే గవర్నర్కు రాజీనామా పత్రాలు సమర్పించాలని భాజపా తన మంత్రులకు సూచించింది.