క్రిటిక్ కత్తిమహేష్ పై బాలకృష్ణ కౌంటర్ ఇచ్చాడని అంటున్నారు పలువురు బాలయ్య అభిమానులు. తాజాగా ఓ ప్రోగ్రామ్ లో కత్తి మాట్లాడుతూ బాలయ్య ను విమర్శించాడు. చదువులేని మూర్ఖుడని తాను గతంలోనే వ్యాఖ్యానించినట్టు కత్తి మహేష్ చెప్పాడు. అంతేకాక పవన్ కంటే బాలయ్య మీద నేను ఎక్కువ విమర్శలు చేశానని చెప్పాడు.`మనుషులను, అభిమానులను కొట్టడం అనైతికం. ఆయనకి మెడికల్ కౌన్సిలింగ్ అవసరం. వీలైనంత త్వరగా బాలయ్యను హాస్పిటల్కు తీసుకెళ్లాలి. తను ఓ రాజు అయినట్టు, తన వంశం మాత్రమే గొప్పదైనట్టు బాలయ్య ఫీలవుతున్నాడు` అని వ్యాఖ్యానించాడు. తనకు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నచ్చి ఎంతో మెచ్చుకున్నానని, కానీ, బాలయ్య ప్రవర్తన చాలా అనాగరికంగా ఉంటుందని మహేష్ చెప్పాడు.
అయితే ఈ నేపథ్యంలో బాలకృష్ణ నటిస్తున్న జై సింహా చిత్రం ప్రోమో 2ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ప్రోమోలో బాలయ్య యాక్షన్ ఎపిసోడ్తో పాటు ఓ డైలాగ్ని కూడా వదిలారు. అయితే ఈ డైలాగ్ని కత్తి మహేష్కి అన్వయిస్తూ.. బాలయ్య అభిమానులు షేర్ చేస్తున్నారు. కత్తి మహేష్ కు బాలయ్యా కౌంటర్ అనేలా . 'బెదిరింపులు నా బాడీకి పడవు' అంటూ విలన్కి వార్నింగ్ ఇస్తున్న సీన్ ఇది. ఈ డైలాగ్తో కత్తికి కరెక్ట్గా కౌంటరేశాడని, బాలయ్యతో పెట్టుకుంటే ఇంతే. అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.