ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 1051 పంచాయతీ కార్యదర్శుల పోస్టుకు ఏపీపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం డిగ్రిచదివన వారికే ఈ ఉద్యోగ అర్హులుగా ప్రకటించింది. కాగా ఈనెల 27నుంచి వచ్చే ఏడాది జనవరి 19వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 21న స్క్రినింగ్ పరిక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 2తేదీన మెయిన్స్ పరీక్ష నిర్వహించబడుతుందని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఇక జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం 114, విజయనగరం 120, విశాఖపట్నం 107 ,తూర్పు గోదావరి 104, పశ్చిమ గోదావరి 25, కృష్ణా- 22 , గుంటూరు 50, ప్రకాశం 172 , నెల్లూరు 63, చిత్తూరు 141, అనంతపురం 41, కర్నూలు 90, కడప 02