పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అజ్ఞాతవాసి. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదలవుతున్న అజ్ఞాతవాసి మూవీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 10 నుంచి 17 వరకు... రోజూ రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 10 గంటల వరకు స్పెషల్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఏపీ సర్కార్ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.