మళ్లీ రక్తమోడిన అమెరికా

Update: 2018-06-29 05:34 GMT

అమెరికాలో మరోమారు తుపాకి గర్జించింది. మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఓ పత్రికా కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగుడు  విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. నాలుగు అంతస్తుల ఈ భవనంపై ఓ గ్లాస్ డోర్ నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ అనూహ్య ఘటనతో అందులో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలువురు ఉద్యోగులు బల్లల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నట్టు సమాచారం

కాల్పులు జరిపిన వ్యక్తి ఘటనా స్థలానికి సమీపంలోనే ఓ భవనంలో నక్కినట్టు పోలీసులు నిర్ధారించారు. హుటాహుటిన పత్రికా కార్యాలయం పరిసర ప్రాంతాలను ఖాళీచేసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సహాయక చర్యలు చేపట్టేందుకు పలు మెడికల్ ఎమర్జెన్సీ బృందాలు ఘటనా స్థలానికి తరలివెళ్లాయి. కాగా దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం‌ప్‌కు సమాచారం అందించామని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.

Similar News