బాలీవుడ్ బిగ్ బీ మనవరాలు, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ ల గారాల పట్టి ఆరాధ్య భావి భారత ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయట. హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన జ్యోతిష్యుడు జ్ఞానేశ్వర్ ఈ విషయాన్ని చెప్పారు. భారత రాజకీయాల్లో ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యకు మంచి భవిష్యత్తు ఉందని, ఆమె ఈ దేశానికి ప్రధాని కాదలుచుకుంటే ఆమె తన పేరును రోహిణీగా మార్చుకోవాలని జ్ఞానేశ్వర్ సూచించారు. చిరంజీవి, రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని తాను అంతకుముందే కచ్చితంగా చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇక, 2024లో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతుందని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ పెళ్లి 2019లో జరుగుతుందని కూడా జ్ఞానేశ్వర్ జోస్యం చెప్పారు.