తమిళనాట పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన యువ నటి ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడ్డారు. వలసరవక్కంలోని తన గృహంలో సీలింగ్కి ఉరి వేసుకొని మరణించింది ప్రియాంక. ఇంటికి పని మనిషి వచ్చి చూడడంతో ప్రియాంక విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆమె పోలీసులకి సమాచారం అందించింది. నటి ఇంటికి చేరుకున్న పోలీసులు ప్రియాంక మరణానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. మూడేళ్ళ క్రితం అరుణ్ బాల అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె మూడు నెలలుగా భర్తకి దూరంగా ఉంటుంది. కుటుంబ కలహాల కారణంగానే ప్రియాంక ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన వంశం అనే సీరియల్తో బాగా ఫేమస్ అయింది ప్రియాంక. ఇందులో జోతిక అనే పాత్ర పోషించింది. ఆమె మృతికి తమిళ సీరియల్ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.