అలనాటి అందాల నటి కృష్ణకుమారి ఇకలేరు. బెంగళూరులోని తన నివాసంలో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఈ రోజు ఉదయం బెంగుళూరులో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విభిన్న పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. 1933 మార్చి 6న బంగాల్లో జన్మించిన ఆమె.. 1951లో ‘నవ్వితే నవరత్నాలు’ అనే చిత్రం ద్వారా తెరంగ్రేటం చేశారు. పల్లె పడుచు, బంగారు పాప చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు తదితర చిత్రాల్లో నటించారు. ఏన్టీఆర్, ఏఎన్నార్ వంటి అగ్రనటులతో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. సుమారు 110 చిత్రాల్లో ఆమె నటించారు. ప్రముఖ నటి షావుకారు జానకి, కృష్ణకుమారి సోదరీమణులు.