ఆవగింజంత సాయం చేసి గుమ్మడి కాయంత ప్రచారం చేసుకునే ఈరోజుల్లో, తమిళ హీరో విజయ్ తాను చేసిన సాయం ఇతరులెవ్వరికీ తెలియకుండా ఉండేలా ప్రయత్నించారు. ఇటీవల తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే కమల్హాసన్, రజినీకాంత్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. తాజాగా స్టార్ హీరో విజయ్ కూడా తూత్తుకుడి వచ్చారు. అయితే ఎలాంటి హడావిడీ లేకుండా సైలెంట్గా వచ్చి అంతే సైలెంట్గా వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి బైక్పై విజయ్ తూత్తుకుడి చేరుకున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. మళ్లీ ఎలాంటి హడావిడీ లేకుండా బైక్పై చెన్నై వెళ్లిపోయారు. తూత్తుకుడిలో విజయ్ బైక్పై తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విజయ్ రియల్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.