24గంటల్లో 149మంది చనిపోయారు

Update: 2018-11-12 09:09 GMT

యెమెన్‌లోని హోదైడా నగరంలో సౌదీ అరేబియా నేతృత్వంలోని బలగాలు ప్రభుత్వానికి మద్దతుగా ఆదివారం తిరుగుబాటుదారులపై చెలరేగిపొయారు. ప్రభుత్వ వర్గాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రపాణానష్టం వాటిల్లింది. దాదాపు 24గంటలు జరిగిన హోరాహోరా కాల్పుల్లో 149 మంది చనిపోయారని డాక్టర్లు, మిలిటరీ అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే హోదైడా వ్యాప్తంగా 110 మంది తిరుగుబాటుదారులు,32 మంది ప్రభుత్వవర్గీయులు చనిపోయారని వైద్యులు వెల్లడించారు.తిరుగుబాటుదారుల గుప్పిట్లో ఉన్న హొదైడా నగరాన్ని ఎలగైనా చేజిక్కించుకోవాలని ప్రభుత్వ బలగాలు ఈ హింసాత్మకతకు దిగాయి.

Similar News