కొత్త రికార్డు సొంతం చేసుకున్న ‘రంగస్థలం’!

Update: 2018-09-17 07:41 GMT

రామ్ చరణ్, సమంతల కాంబినేషన్లో తెర‌కెక్కించిన‌ 'రంగస్థలం' చిత్రం అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ 1985 నాటి బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. గోదావరి యాసతో 'రంగమ్మా, మంగమ్మా... ఏం పిల్లడూ.. ' అనే పాట సోషల్ మీడియాలో 10 కోట్ల వ్యూస్ ను దాటేసి రికార్డు పుటల్లోకి ఎక్కింది. 100మిలియన్లు సాధించిన రెండో తెలుగు పాటగా రంగమ్మా.. మంగమ్మా నిలిచింది. దేవీ శ్రీ మ్యూజిక్, మానసి వాయిస్‌కు తోడు సమంతల ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాట ఇంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకునేలా చేసింది. కాగా బాహుబలిలోని సాహోరో బాహుబలి పాట తెలుగులో మొదటి 100మిలియన్ల వ్యూస్‌ను సాధించి, రికార్డు సృష్టించింది.

Similar News