పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ ఫోన్ ప్రియుల కోసం కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది ఒప్పో తయారీ సంస్థ. ఎంతో ఆకర్షనీయంగా కనిపించే ఒప్పో ఎఫ్ 15 స్మార్ట్ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో గురువారం మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఈ ఫోన్ ధర రూ. 19,990 మాత్రమే. దీన్ని సొంతం చేసుకోవాలనుకున్న వారు అమెజాన్.ఇన్, ఫ్లిప్కార్ట్ , ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్లలో ఈ రోజు నుంచే బుక్ చేసుకోవచ్చు. అంతే కాదండీ వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్, హెచ్డిఎఫ్సి కార్డ్ వినియోగదారులకు 10 శాతం క్యాష్బ్యాక్ లాంచింగ్ ఆఫర్లను కూడా ఉన్నాయి.
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే
* వాటర్డ్రాప్-స్టైల్ నాచ్ డిజైన్తో అమోలెడ్ డిస్ప్లే
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత వీడియో బ్యూటిఫికేషన్
* కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ట్,
* ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్,
* వూక్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ,
* వెనుక భాగంలో క్వాడ్ కెమెరా
* 6.4 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే
* ఆండ్రాయిడ్ 9 పై
* 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
* 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* 128 దాకా విస్తరించుకునే అవకాశం
* 48+8+2+2ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా
* 16 ఎంపీ సెల్ఫీకెమెరా
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ