టీటీడీ పాలక మండలిని రద్దు చేస్తూ జీవో జారీ... నూతన చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మెన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు గరుడాళ్వార్ సన్నిధిలో సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు ఛైర్మెన్గా సుబ్బారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పాత బోర్డును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండలి సభ్యులుగా సుధా నారాయణమూర్తి, సుగవాసి ప్రసాద్బాబు, రుద్రరాజు పద్మరాజు, ఇ.పెద్దిరెడ్డి, డొక్కా జగన్నాథం తదితరుల రాజీనామాలను సైతం ప్రభుత్వం ఆమోదించింది. అలాగే కొత్త బోర్డు సభ్యులను కూడా త్వరలోనే నియమిస్తారు.