విశాఖలో పిల్లి మాంసం కలకలం..హోటల్స్‌కు విక్రయిస్తున్న ముఠా

Update: 2019-08-27 10:41 GMT

హాటల్ ఫుడ్‌కు బాగా అలవాటు పడ్డారా..? నాన్ వెజ్ అంటే మీకు చాలా ఇష్టమా..? మీరు హోటల్‌లో తినేది చికెన్, మటనే అనుకుంటున్నారా..? కాస్తా ఆలోచించండి. ఇప్పుటి వరకు హోటల్‌లో కుక్క మాసాన్ని హోటళ్లకు సప్లయి చేసే మాయగాళ్లను చూశాం. తాజాగా పిల్లి మాంసాన్ని సైతం హోటళ్లకు విక్రయిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఈ పిల్లి మాంసం వ్యవహారం బయటపడింది. గ్రామాల్లో తిరుగుతూ పిల్లులను పట్టుకుని వాటిని చంపి హోటళ్లకు అమ్మేస్తున్నారు. విశాఖలోని ఓ స్వచ్ఛంద సంస్థ సమాచారంతో రంగంలోకి దిగిన ఆరిలోవ పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

పిల్లులను వ్యాన్‌లో తరలిస్తుండగా వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన పిల్లి కళేయబరాన్ని పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ముఠాది గుంటూరు జిల్లా బెల్లంకొండకు చెందనదిగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా వీరు విశాఖ జిల్లాలో పిల్లులను వేటాడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

Full View 

Tags:    

Similar News