ఏపీ పోలీసులు మహిళా మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల విశాఖ ఏజెన్సీలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో భవాని అలియాస్ కళావతి అనే మావోయిస్టు తీవ్రంగా గాయపడింది. దీంతో మహిళా మావోయిస్టును చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పూర్తైన తర్వాత మరింత విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.