భక్తులపై దాడి ఘటనపై టీటీడీ సీరియస్‌..

Update: 2019-06-14 15:51 GMT

అలిపిరి టోల్‌గేట్ దగ్గర భక్తులపై టీటీడీ సిబ్బంది దాడికి పాల్పన ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. భక్తులపై దాడికి నలుగురు SPF కానిస్టేబుళ్లను ప్రాధాన్యత లేని ప్రాంతాలకు బదిలీ చేశారు. నిన్న తిరుమల వెళుతున్న భక్తులపై దాడికి దిగిన నలుగురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై తీవ్ర స్ధాయిలో విమర్శలు రావడంతో తిరుపతి అర్బన్ ఎస్పీ విచారణకు ఆదేశించారు. నలుగురు కానిస్టేబుళ్ల ప్రమేయాన్ని నిర్ధారించిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే బదిలీతో సరిపెట్టకుండా వేటు వేయాలని భక్తులు కోరుతున్నారు. 

Tags:    

Similar News