రేపు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరంని సందర్శించనున్నారు .. ఈ విషయాన్నీ జలవనరులు శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు .. అయితే సీఎం అయిన తరవాత జగన్ పోలవరాన్ని సందర్శించడం ఇదే మొదటి సారి కావడం విశేషం .. జగన్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు పోలవరానికి సంబంధించి అన్ని అంశాలపైనా సమీక్ష నిర్వహిస్తారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు .. జూలై 15 తర్వాత వచ్చే వరదల బారిన పడే అవకాశమున్న 48 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అయన వెల్లడించారు .అ తర్వాత జగన్ తెలంగాణాలో పర్యటిస్తారు .. ఇటివలే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ని ఆహ్వానించిన సంగతి తెలిసిందే ..