Tirumala: నేటితో ముగియనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
Tirumala: తెప్పపై విహరించనున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి
Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు నేటితో ముగియనున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి తెప్పపై విహరించనున్నారు. నేడు ఆర్జిత, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశారు. రేపు శ్రీవారి ఆలయంలో తుంబుర తీర్థ ముక్కోటి, గరుడ సేవ నిర్వహించనున్నారు. తీరొక్క రకాల పూలు, విద్యుత్ దీపాలతో తెప్పోత్పవాన్ని అందంగా అలంకరించారు. తెప్పపై పుష్కరిణిలో ఐదుసార్లు.. ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు శ్రీవారు. ఉత్సవాన్ని తిలకించేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు.