ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం

Update: 2019-06-15 06:01 GMT

ఏపీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణికి తృటిలో ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా భోగాపురంలో పుష్పశ్రీవాణికి స్వాగత సత్కారం ఏర్పాటు చేశారు. స్వాగత ఏర్పాట్లలో భాగంగా పార్టీ కార్యకర్తలు భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలందరూ పుష్పమాల వేసేందుకు ఒక్కసారిగా వేదికపైకి ఎక్కారు. దీంతో ఉన్నట్టుంది వేదిక కూలిపోయింది. భద్రతా సిబ్బంది డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిని వెంటనే కిందకి దించారు. 

Full View

Tags:    

Similar News