బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్ తరహాలో రాయలసీమలో కూడా రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాయలసీమకు ఇచ్చిన రాజధానిని.. బంగారు పళ్లెంలో పెట్టి.. ఆంధ్రకు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అమరావతిని ఫ్రీజోన్ చేసి.. సీమ వాసులకు ఉద్యోగ అవకాశాలను పంచాలని.. టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా.. టీటీడీ ఆదాయాన్ని పంచినట్లే.. దుర్గమ్మ, సింహాచలం ఆదాయాన్ని ఎందుకు పంచరని ప్రశ్నించారు. మా తిరుపతి ఆదాయాన్ని మా ప్రాంతానికి పంచాలని టీజీ వెంకటేశ్ తేల్చిచెప్పారు.