విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కొట్లాట

Update: 2019-09-15 07:21 GMT

విజయవాడు ప్రభుత్వాసుపత్రిలో నిన్న అర్ధరాత్రి కొట్లాట జరిగింది. రోగి బంధువులు డ్యూటీ డాక్టర్‌తో అమర్యాదగా ప్రవర్తించారు. ట్రీట్‌మెంట్‌ విషయంలో ఆలస్యం ఎందుకు అవుతోందని డ్యూటీ డాక్టర్‌ని నిలదీశారు. విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్‌ తన స్నేహితులకి విషయం వాట్సాప్‌ ద్వారా తెలియజేశారు. దీంతో 200 మంది మెడికల్ విద్యార్ధులు, వారి స్నేహితులు రంగ ప్రవేశం చేశారు. రోగి బంధువులను చితక బాదారు. ఈ సంఘటన తర్వాత మెడికల్‌ స్టూడెంట్స్‌, రోగి బంధువులు పోలీస్‌ స్టేషన్‌కు చేరారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో సీసీటీపీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. 

Tags:    

Similar News