AP Elections 2020: చర్చకు నేను సిద్ధం.. వైసీపీ సిద్ధమా ? : అచ్చెన్నాయుడు
వైసీపీపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కరోనాపై సీఎం, మంత్రుల వ్యాఖ్యలతో రాష్ట్ర పరువుపోతుందన్నారు. ఈసీపై స్పీకర్ విమర్శలు చేయడం సరికాదన్నారు. కుల ప్రాధాన్యంపై బహిరంగ చర్చకు తాను సిద్దమని వైసీపీ సిద్ధమైతే చర్చకు రావాలని సవాల్ విసిరారు. సమాజం గురించి తెలుసుకొని ఇప్పటికైనా జగన్ తన వ్యవహార శైలి మార్చుకోవాలని సూచించారు.