ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ వాహనాల్లో మార్పు చేస్తున్నట్లు సీఎం భద్రతా అధికారులు వెల్లడించారు. కాన్వాయ్లోకి కొత్తగా ఆరు నలుపు రంగు ఫార్చ్యూనర్ వాహనాలు చేరాయి. ఏపీ 39 పీఏ 2345 నెంబర్తో కొత్త వాహనశ్రేణి అందుబాటులోకి వచ్చింది. పాత కాన్వాయ్ను హైదరాబాద్కు పంపడంతో కొత్తవాటిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇటీవల సీఎం ఛాంబర్, కేబినెట్ హాల్, హెలిపాడ్, సీఎం కాన్వాయ్ రూట్లను ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. జగన్ నేమ్ ప్లేట్ను కూడా సుబ్బారెడ్డి పరిశీలించి ఆమోదించిన విషయం తెలిసిందే.