నిన్నటి నుండి బడి గంట మోగింది. ఇక చకచక స్కూల్ వైపు పరుగులు తీశారు విద్యార్థులు. అయితే స్కూల్స్ ఓపేన్ కావడంతో తలితండ్లులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. తమ పిల్లల్ని రెడీ చేయ్యడం స్కూల్లో బుక్ప్ కొనివ్వడం, ఫీజులు చెల్లించడం ఇలా ఫుల్ బీజి అయిపోతారు. ఇంత చేసి విద్యార్థులను బడికి పంపిస్తూంటే కొన్ని స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఇంకా డొక్కు బస్సుల్లో తీసుకెళ్లు విద్యార్థుల జీవితాలతో చలగాటం అడుతున్నాయి. ఇప్పటికే ప్రమాదాల్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనిపై ముందుగానే అప్రమత్తమైన ఏపీ సర్కార్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందేందుకు ఇవాళే చివరి రోజు అని మరోసారి గుర్తు చేసింది. ఏపీ రవాణశాఖ మంత్రి పేర్ని నాని స్కూల్ యాజమాన్యాలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. రవాణశాఖ మంత్రిగా పేర్నినాని బాధ్యతలు స్వీకరించారు. ఫిట్నెస్, పర్మిషన్ లేని బస్సుల సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిట్నెస్లేని బస్సుల సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు చెందిన స్కూల్ బస్సులైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. నేటి సాయంత్రం వరకూ ఫిట్నెస్ నిరూపించుకోవచ్చని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.