పోలవరం కాంట్రాక్ట్ నుంచి తమను తొలగించడంతో నవయుగ సంస్ధ హైకోర్టును ఆశ్రయించింది. గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టును అర్ధాంతరంగా రద్దు చేయడం వల్ల తమ సంస్ధ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిందని నవయుగ పిటీషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా వేగంగా పనులు చేస్తున్నా ఉద్దేశపూర్వకంగానే తమను కాంట్రాక్ట్ నుంచి తొలగించారని సంస్ధ యాజమాన్యం ఆరోపించింది. తమ సంస్ధ పనితీరును పరిగణలోకి తీసుకుని కాంట్రాక్ట్ కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. నవయుగ సంస్ధ దాఖలు చేసిన పిటిషన్ ఏపీ హైకోర్టులో కాసేపట్లో విచారణకు రానుంది.