అమరావతిపై మరో సారి బొత్స సంచలన వ్యాఖ్యలు

Update: 2019-09-07 09:38 GMT

రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారా ? అంటూ టీడీపీ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతో రాజధానికి అడ్రస్ లేకుండా పోయిందని బొత్స ఆరోపించారు. రోజుకో మాట పూటకో బాట పట్టే పవన్ కళ్యాణ్ రాజధాని విషయంలో గతంలో ఏమన్నారో ఓ సారి గుర్తు చేసుకోవాలన్నారు. తుగ్లక్ పాలన అంటే చంద్రబాబు నాయుడిదే అనే విషయం లోకేశ్‌ తెలుసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.

Tags:    

Similar News