కోడెల శివప్రసాద్ మృతి చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అంబటి, కోడెల మృతిపై తెలంగాణ ప్రభుత్వం నిష్పక్షపాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోడెల మృతిపై అనేక రకాల వార్తలు వస్తున్నాయన్న అంబటి, అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.