శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వారికి రీఫండ్
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ను కేంద్రం పొడిగించడంతో టీటీడీ కీలక నిర్ణయ తీసుకుంది. మే 3వరకు శ్రీవారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, మే 31 వరకు ఆర్జిత సేవలూ రద్దు చేసింది. ఈ మేరకు ఆర్జిత సేవలను గానీ, దర్శన టికెట్లను గానీ బుక్ చేసుకున్న భక్తులు సంబంధిత టికెట్ వివరాలతోపాటు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలను helpdesk tirumala.org మెయిల్ ఐడికి పంపాలని టీటీడీ సూచించింది. ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఈ వివరాల ఖచ్చితత్వాన్ని పరిశీలించిన అనంతరం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భక్తుల ఖాతాల్లోకి జమ చేస్తామని టీటీడీ తెలిపింది.