శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్న వారికి రీఫండ్‌

Update: 2020-04-16 09:36 GMT

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించడంతో టీటీడీ కీలక నిర్ణయ తీసుకుంది. మే 3వరకు శ్రీవారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, మే 31 వరకు ఆర్జిత సేవలూ రద్దు చేసింది. ఈ మేర‌కు ఆర్జిత సేవ‌లను గానీ, ద‌ర్శ‌న టికెట్ల‌ను గానీ బుక్ చేసుకున్న భ‌క్తులు సంబంధిత టికెట్ వివ‌రాల‌తోపాటు, బ్యాంకు ఖాతా నంబ‌రు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివ‌రాల‌ను helpdesk tirumala.org మెయిల్ ఐడికి పంపాల‌ని టీటీడీ సూచించింది. ఐటీ విభాగం ఆధ్వ‌ర్యంలో ఈ వివ‌రాల ఖ‌చ్చిత‌త్వాన్ని ప‌రిశీలించిన అనంత‌రం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భ‌క్తుల ఖాతాల్లోకి జ‌మ చేస్తామని టీటీడీ తెలిపింది.

Tags:    

Similar News