పోలవరం ప్రాజెక్టు పనులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించేందుకు నిర్ణయం తీసుకుంది. నిర్మాణ పనుల నుంచి వైదొలగాలని నవయుగ సంస్థకు ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసింది. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రీ క్లోజర్ నోటీసులు జారీ చేసింది. 2018 ఫిబ్రవరిలో నవయుగ సంస్థకు 60 సి ప్రకారం మూడు వేల కోట్ల విలువైన పనులు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.