ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ గవర్నర్ నరసింహన్తో భేటీ కానున్నారు. విజయవాడకు రానున్న గవర్నర్ నరసింహన్ను ఉదయం 11 గంటలా 30 నిమిషాలకు గేట్ వే హోటల్లో కలవనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే కేంద్రబడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై చర్చిస్తారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు.