Andhra Pradesh: డేంజర్ జోన్ లో కృష్ణా

Update: 2020-06-22 04:52 GMT

కృష్ణా జిల్లాలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో వెయ్యి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటవరకూ 1048 మొత్తం కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న మరో 66 కొత్త కేసులు, 36 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కృష్ణా లో కరోనతో ముగ్గురు మృతి. యక్టీవ్ కేసులు,మరణల్లో తొలిస్థానంలో ఉంది. వైరస్ గుపిట్లో విజయవాడ,గన్నవరం,పెనములూరు,నూజివీడు నియోజవర్గాలు ఉన్నాయి. కరోనాతో విజయవాడ కార్పొరేషన్ వైసీపీ అభ్యర్థి మృతి చెందారు. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన వారి నుంచి కేసులు నమోదవుతున్నాయి.

ప్రభుత్వ పాలనంతా ఎక్కువ శాతం విజయవాడ నుంచే సాగుతుంది. సచివాలయం,గుంటూరు లో ఉన్న ఎక్కువ hod లు విజయవాడ నగరం నుంచే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ వెళ్లకుండా సచివాలయ ఉద్యోగులు విజయవాడలోనే నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వారి సంఖ్య పెరిగింది అదే పెద్ద సమస్యగా మారింది. వారితోనే కరోనా వ్యాప్తికి కారణం అవుతుందని అధికారులు అంటున్నారు.


Tags:    

Similar News