CM Jagan: నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
CM Jagan: తుపాను తీవ్రతతో నష్టపోయిన పంటల పరిశీలన
CM Jagan: నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
CM Jagan: సీఎం జగన్ ఇవాళ తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న జగన్.. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లనున్నారు సీఎం జగన్. అక్కడ తుపాను బాధితులతో మాట్లాడనున్నారు. తర్వాత కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. తర్వాత బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.