టిడిపి కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు ఏపి ప్రతిపక్ష నేత మరియు టిడిపి అధినేత చంద్రబాబు .. ఈ రోజు రుద్రమాంబపురంలో పర్యటించారు ఆయన.. వైసీపీ మరియు టిడిపి కార్యకర్తల వివాదంలో బలైన తెదేపా కార్యకర్త పద్మావతి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.. అంతేకాకుండా వారి కుటుంబానికి అయిదు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందిచారు .. పద్మావతి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని చెప్పారు . శాంతి భద్రతల విషయంలో నేను చాలా కఠినంగానే ఉంటానని, పద్మావతి ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు చంద్రబాబు ..
ఇంత అమానుషంగా ప్రాణంతీసిన వాళ్ళు అసలు మనుషులేనా? ఈ దారుణాలపై ఇంతవరకు నోరుమెదపని సీఎంకానీ, ఇలాంటి వాటన్నిటికీ మేము కాపలా ఉండలేమని నిర్లక్ష్యంగా మాట్లాడిన హోంమంత్రిగారు కానీ అనాధలైన పద్మగారి పిల్లలకు ఏ సమాధానం చెప్తారు? రౌడీరాజ్యంతో రాష్ట్రాన్ని రావణకాష్టం చెయ్యాలి అనుకుంటే ఊరుకోము pic.twitter.com/9ilRNpN4AI
— N Chandrababu Naidu (@ncbn) July 5, 2019