టిడిపి కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతుంది: చంద్రబాబు ..

Update: 2019-07-05 15:03 GMT

టిడిపి కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు ఏపి ప్రతిపక్ష నేత మరియు టిడిపి అధినేత చంద్రబాబు .. ఈ రోజు రుద్రమాంబపురంలో పర్యటించారు ఆయన.. వైసీపీ మరియు టిడిపి కార్యకర్తల వివాదంలో బలైన తెదేపా కార్యకర్త పద్మావతి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.. అంతేకాకుండా వారి కుటుంబానికి అయిదు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందిచారు .. పద్మావతి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని చెప్పారు . శాంతి భద్రతల విషయంలో నేను చాలా కఠినంగానే ఉంటానని, పద్మావతి ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు చంద్రబాబు .. 



Tags:    

Similar News