ఇది ఏపీకి కష్టాల సంక్రాంతి: చంద్రబాబు

Update: 2020-01-15 08:35 GMT
ఇది ఏపీకి కష్టాల సంక్రాంతి: చంద్రబాబు

ఇది ఏపీకి కష్టాల సంక్రాంతి అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధాని విషయంలో సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. మందడంలో రైతుల దీక్షకు కుటుంబీకులతో కలిసి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. తండ్రి చనిపోతే ఓదార్పు యాత్ర చేసిన జగన్ రాజధాని మృతుల కుటుంబాలకు ఎందుకు ఓదార్చడంలేదని చంద్రబాబు ప్రశ్నించారు.

రైతులు ఇబ్బందులు పడుతుంటే, సీఎం జగన్ ఎడ్లపందాలకు వెళ్లారని బాబు ఎద్దేవా చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన మహిళలపై దాడులు చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరుడుగట్టిన ఉగ్రవాదిలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని, అందర్నీ బాధపెట్టి ఆయన పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రాజధాని కోసం ఎవరూ ప్రాణత్యాగాలు చేయొద్దని పోరాడి సాదిద్ధామని రైతులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News