ఆత్మహత్యలు వద్దు : చంద్రబాబు

Update: 2019-10-14 14:37 GMT

తెలంగాణాలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఒంటికి నిప్పంటించుకుని చనిపోగా, సురేందర్ గౌడ్ అనే కండక్టర్ ఉరేసుకుని చనిపోయాడు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలపై టీడీపీ నేత చంద్రబాబు స్పందించారు . జీవితం ఎంతో విలువైనది. ఏదైనా బతికి సాధించాలే తప్ప బలవన్మరణాల వల్ల సమస్యలు పరిష్కారం కావని అయన అన్నారు. కార్మికులందరూ తమ కుటుంబాల గురించి కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరులో జరిగిన టీడీపీ నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో పాల్గొన్న అయన ఈ అంశంపై స్పందించారు.

Tags:    

Similar News