ఓటమికి గల కారణాలను సరిదిద్దుకోవాలి: చంద్రబాబు

Update: 2019-06-15 01:25 GMT

ఓటమికి గల కారణాలను అన్వేషించి వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని త్వరలోనే కార్యాచరణ రూపొందించి ముందుకెళ్దామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలతో సంబంధాలు మరింత పెంచుకుని కష్టనష్టాల్లో పాలుపంచుకునేలా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అభివృద్ధి, సంక్షేమంలో ఏ లోటు లేకుండా చేశామని చంద్రబాబు అన్నారు. అయినా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామనే విషయంపై నేతలు క్షేత్రస్థాయి నుంచి సమీక్షలు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఓటమి చెందినా ఈ సారి పార్టీకి ఓట్ల శాతం పెరిగిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటమికి కారణాలు అన్వేషించడంతో పాటు ఒక్కో నియోజకర్గంలో ఓటమికి గల కారణాలను తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు. పార్టీ నేతలంతా కార్యకర్తలకు అండగా ఉంటూ వారికి ధైర్యం చెప్పాలని చంద్రబాబు ఆదేశించారు. టీడీపీ అధినేత, ఏపీ మాజీమంత్రి చంద్రబాబు టీడీపీ వర్క్ షాప్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. 

Tags:    

Similar News