జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. కావాలనే కృత్రిమ వరదలను సృష్టించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ముందే నీళ్లు వదిలిపెట్టుంటే వరదలు వచ్చేవికాదన్న చంద్రబాబు తన ఇంటిని ముంచాలని కుట్రచేస్తే దానికి ప్రజలు బలైపోయారని అన్నారు. తన ఇంటిపైకి డ్రోన్లను పంపించి భయాందోళనలకు గురిచేశారన్న చంద్రబాబు డ్రోన్లతో ఫొటోలు తీయొచ్చు బాంబులు కూడా వేయొచ్చన్నారు. అయితే తాను చావుకి భయపడేవాడిని కాదని, ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడతానన్నారు.