జగన్ ని అభినందించిన బుద్ధా వెంకన్న ..

Update: 2019-06-14 10:10 GMT

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వాఖ్యాలను ఏపి టిడిపి నేత బుద్ధా వెంకన్న అభినందించారు .. అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపులను తాను వ్యక్తిగతంగా అభినందిస్తున్నట్లు అమరావతిలో మీడియాతో మాట్లాడిన అయన ఈ వాఖ్యలు చేసారు .. అంతే కాకుండా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వాఖ్యాలపై బుద్ధా ఫైర్ అయ్యారు .. టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ అయన చేసిన వాఖ్యలు సరికావని అన్నారు .. అంతే కాకుండా ఈ రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగం పై కూడా బుద్ధా స్పందించారు. గవర్నర్ ప్రసంగం కేవలం 'నవరత్నాలు' పైనే ఉందని మిగతా విషయాల గురించి గవర్నర్ పెద్దగా మాట్లాడలేదని ఆరోపించారు. 'నవతర్నాలు'లోని చాలా అంశాలను తమ ప్రభుత్వం హయాంలో అమలు చేశామన్నారు . ఇవేవో కొత్తగా అమలు చేసే పథకాలని కేవలం పేర్లు మాత్రంమే మార్చారని అన్నారు.

Tags:    

Similar News