బడ్జెట్ రూపకల్పనపై ఏపీ ఆర్థిక శాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇవాళ, రేపు శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చర్చలు జరపనున్నారు. తొలి రోజు 12 శాఖలతో భేటీ కానున్న ఆర్థిక మంత్రి.. ఆయా శాఖల ప్రతిపాదనపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి 12 శాఖల మంత్రులు హాజరుకానున్నారు.