ఏపీ సీఎం జగన్ రాష్ర్ట వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి గ్రామ స్థాయిలో రచ్చబండ తరహా కార్యక్రమం చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అమలు పని తీరుపై ప్రజల నుంచి నేరుగా తెలుసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.