ఏపీ అసెంబ్లీలో తనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భగ్గుమన్నారు. నా రాజకీయ అనుభవమంత వయసు లేదంటూ జగన్పై మండిపడ్డారు. ఇంత త్వరగా సభలో గోదావరి జలాల ప్రస్తావన ఇప్పుడే తెస్తారనుకోలేదన్నారు చంద్రబాబు. మీరేదో గట్టిగా మాట్లాడితే భయపడే వాడిని కాదన్నారు చంద్రబాబు. చాలా సున్నితమైన సమస్యపై స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవద్దన్నారు చంద్రబాబు. ఇది ఐదో కోట్ల మందికి సంబంధించిన సమస్యగా చెప్పిన బాబు. నీటి జలాల వినియోగంలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఏమీ ఆలోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దన్నారు.