ఏపీలో రెండో రోజు ఏసీబీ దాడులు కొనసాగుతోన్నాయి. నిన్నటి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగాల్లో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో 14 టీమ్లు, 100 మందికిపైగా అధికారులు పాల్గొంటున్నారు. ఇప్పటికే రికార్డ్స్ మెయింటెనెన్స్లో లోపాలు, ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం, సిటిజన్ చార్ట్లో నిర్లక్ష్యాలు, అనధికారిక నగదు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ గుర్తించారు. టౌన్ప్లానింగ్ విభాగంపై ఏసీబీకి వరుసగా అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.