ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,136 మంది నమూనాలు పరీక్షించగా 47 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,561కి చేరింది. 47 మంది కోవిడ్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2561 పాజిటివ్ కేసులకు గాను 1778 మంది డిశ్చార్జ్ కాగా, 56 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 727.