తన తొలి మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్ తో దక్షిణాఫ్రికా ను తిప్పలు పెడుతోంది. కానీ.. సౌతాఫ్రికా సారధి డుప్లిసిస్ తన సహచరుడు డుసెన్ తో కలసి సమర్థవంతంగా భారత్ బౌలింగ్ దాడిని ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమం లో ఈ జోడీ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అయితే.. చాహల్ ఈ జోడీని విడదీశాడు. నిలకడగా ఆడుతున్న డుసెన్ (22 ) ను పెవిలియన్ బాట పట్టించాడు. తరువాత వెంటనే కెప్టెన్ డుప్లిసిస్ ను దొరకపుచ్చుకున్నాడు. వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ముఖ్యంగా డుప్లిసిస్ అవుట్ అవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ.