ఆర్సీబీని దురదృష్టం నీడలా వెంటాడుతూనే ఉన్నది. సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీసేన 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వాంఖడె వేదికగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 172 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై..డికాక్(40), హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 37 నాటౌట్, 5 ఫోర్లు, 2సిక్స్లు) విజృంభణతో 19 ఓవర్లలోనే విజయాన్నందుకుంది.